లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్పై ఉత్కంఠ వీడింది. ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తాసంస్థ డెయిలీ టెలీగ్రాఫ్ పేర్కొంది. కరోనా కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతినిధులతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. దీనికి తోడు కెప్టెన్ జోరూట్ సహా పలువురు ప్రముఖ ప్లేయర్లు యాషెస్ సిరీస్లో ఆడేందుకు మొగ్గుచూపినట్లు సదరు వార్తాసంస్థ పేర్కొంది. అయితే కుటుంబానికి దూరంగా ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడని జోస్ బట్లర్తో పాటు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న బెన్ స్టోక్స్ యాషెస్ సిరీస్కు దూరంగా ఉంటున్నారు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు యాషెస్ సిరీస్ జరుగనుంది.