ENG vs NZ | కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్ను తట్టుకుని ఇంగ్లండ్ ప్లేయర్లు నిలకడగా ఆడారు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేశారు. వన్డే వరల్డ్కప్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ను ఎంచుకుంది.
బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్ల వికెట్లను వరుసగా పడగొడుతూ షాకుల మీద షాకిచ్చింది. దీంతో బెయిర్స్టో (33), మలన్ (14), బ్రూక్ (25), అలీ (11), బట్లర్ (43), లివింగ్స్టోన్ (20) తక్కువ పరుగులకే ఔట్ చేసి పెవిలియన్కు చేరింది. ఈ క్రమంలో కివీస్ బౌలర్లను తట్టుకుని జో రూట్ ( 77) ఒక్కడే నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. రూట్ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ ఓక్స్ ( 11), సామ్ కర్రన్ (14) కూడా కివీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 282 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, గ్లెన్ ఫిలిప్స్ 2, మిచెల్ శాంటర్న్ 2, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే న్యూజిలాండ్ 283 పరుగులు చేయాల్సి ఉంది.