ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ నుంచి ఓపెనర్గా వస్తున్న రిషభ్ పంత్ (1) ఈ మ్యాచ్లో నిరాశ పరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను.. రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన బంతిని లెగ్ సైడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్ ఫెయిలయ్యాడు.
ఈ క్రమంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని తొడకు తగిలి కీపర్ బట్లర్ చేతుల్లోకి వెళ్లింది. దాన్ని అతను సులభంగా అందుకోవడంతో పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు.