ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ మరోసారి బౌలింగ్ ఎంచుకున్నాడు.
అదే సమయంలో భారత్కు మరో షాక్ తగిలింది. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతని స్థానంలో సిరాజ్ ఆడుతున్నట్లు వెల్లడించాడు. అదే సమయంలో తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని ఇంగ్లండ్ సారధి బట్లర్ తెలిపాడు.
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో, జో రూట్, బెన్స్టోక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టన్, మొయీన్ అలీ, డేవిడ్ విల్లే, క్రెగ్ ఓవర్టాన్, బ్రైడన్ కార్సె, రీస్ టాప్లే,
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
A look at our Playing XI for the game.
Live – https://t.co/radUqNrOn1 #ENGvIND pic.twitter.com/TkbzNYfLrw
— BCCI (@BCCI) July 17, 2022