భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ మరో కీలక వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్ (27)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. 37వ ఓవర్లో పాండ్యా వేసిన తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన లివింగ్స్టోన్.. మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు.
పాండ్యా వేసిన షార్ట్ బాల్ను పుల్ చేసిన లివింగ్స్టోన్.. జడేజాకు చిక్కాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన కెప్టెన్ బట్లర్ (60)ను కూడా అదే ఓవర్ చివరి బంతికి పాండ్యా పెవిలియన్ చేర్చాడు. పాండ్యా వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బట్లర్ కూడా జడేజాకే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 37 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 199 పరుగులతో నిలిచింది.