ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నిరాశ పరిచిన టీమిండియా మాజీ కోచ్ విరాట్ కోహ్లీ.. రెండో టీ20 మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో కోహ్లీకి అవకాశం ఇవ్వాలా? లేదా హుడాను కొనసాగించాలా? అని టీం మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది.
ఇది అసలు ప్రశ్నే కాదని అంటున్నాడు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ. ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇషాంత్.. ‘‘ఎవరు ఏమని అనుకుంటున్నా సరే.. కోహ్లీ అందుబాటులో ఉంటే అతను మ్యాచ్ ఆడతాడు. హుడా చక్కగా ఆడాడు. కానీ కోహ్లీ కూడా మూడో స్థానంలో ఆడతాడు కాబట్టి ఆ ప్లేస్ ఖాళీ చేయాల్సి వస్తుంది’’ అని ఇషాంత్ అన్నాడు.
అలాగే అక్షర్ పటేల్ స్థానంలో జడేజాను తీసుకోవాలని సూచించాడు. పాండ్యా, దినేష్ కార్తీక్ ఎలా ఆడగలరో జడ్డూ కూడా అంతటి హిట్టింగ్ చేయగలడని ఈ పొడుగు పేసర్ చెప్పాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్కు జట్టులో స్థానం దక్కడం కష్టమని భావించాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఐదో స్థానంలో పాండ్యా అద్భుతంగా రాణిస్తున్న సమయంలో.. అయ్యర్కు అవకాశం దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు.