నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. షమీ వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (12 నాటౌట్) మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో ఓవర్ ప్రారంభించిన సిరాజ్ సరైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తూ బెయిర్స్టో (0)ను ఇబ్బంది పెట్టాడు.
ఈ క్రమంలోనే తొలి రెండు బంతులను సరిగా ఆడలేకపోయిన బెయిర్స్టో.. మూడో బంతికి అవుటయ్యాడు. ప్యాడ్స్ మీదకు వచ్చిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు బెయిర్స్టో ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. సులభంగా క్యాచ్ అందుకోవడంతో బెయిర్స్టో పెవిలియన్ చేరాడు.
ఆ వెంటనే రూట్ (0)ను కూడా సిరాజ్ అవుట్ చేశాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను ఆడేలకపోయిన రూట్.. మూడో బంతికి స్లిప్స్లో ఉన్న కెప్టెన్ రోహిత్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు 12/2 స్కోరుతో నిలిచింది.
That's a double wicket maiden over from @mdsirajofficial 💥💥
Bairstow and Root depart for a duck.
Live – https://t.co/radUqNrOn1 #ENGvIND pic.twitter.com/E4QDMgvKZa
— BCCI (@BCCI) July 17, 2022