ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ (27) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి, కెప్టెన్ బట్లర్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన మొయీన్ అలీ (34) పెవిలియన్ చేరాడు. 28వ ఓవర్లో తొలిసారి బంతి అందుకున్న జడేజా.. అలీని బోల్తా కొట్టించాడు.
జడ్డూ వేసిన బంతిని స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన అలీ.. ఎక్స్ట్రా బౌన్స్ను ఊహించలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. ఈ వికెట్తో 75 పరుగుల బట్లర్-అలీ భాగస్వామ్యానికి తెరపడింది. అలీ అవుటవడంతో లియామ్ లివింగ్స్టన్ క్రీజులోకి వచ్చాడు.