ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ (31), జడేజా (46 నాటౌట్) ధాటిగా ఆడటంతో 170/8 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ను భువనేశ్వర్ కుమార్ ముప్పుతిప్పలు పెట్టాడు.
ప్రమాదకరమైన జోస్ బట్లర్ (4), జేసన్ రాయ్ (0) ఇద్దరినీ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మొయీన్ అలీ (35), డేవిడ్ విల్లే (33 నాటౌట్) తప్ప మిగతా ఇంగ్లిష్ బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. డేవిడ్ మలాన్ (19), లియామ్ లివింగ్స్టన్ (15), హ్యారీ బ్రూక్ (8), శామ్ కర్రాన్ (2), క్రిస్ జోర్డాన్ (1) నిరాశ పరిచారు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.
ఈ క్రమంలోనే 17వ ఓవర్ చివరి బంతికి మ్యాట్ పార్కిన్సన్ (0)ను అవుట్ చేసిన హర్షల్ పటేల్.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టు 121 పరుగులకే ఆలౌట్ అయింది. భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగగా.. జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
హార్దిక్ పాండ్యా, హర్షల్ పటేల్ చెరో వికెట్తో సత్తా చాటారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. అలాగే వరుసగా 14 టీ20 మ్యాచుల్లో గెలుపొందిన కెప్టెన్గా రోహిత్ మరో రికార్డు సృష్టించాడు.