కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ఆరంభంలోనే బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మరో వెటరన్ పేసర్ షమీ కూడా సత్తాచాటాడు. బెన్స్టోక్స్ (0)ను తొలి పవర్ప్లేలోనే అవుట్ చేసిన షమీ.. ఆ తర్వాత ఇంగ్లండ్సారధి జోస్ బట్లర్ (30)ను పెవిలియన్ చేర్చాడు.
షమీ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చిన బట్లర్ మైదానం వీడాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మొయీన్ అలీ (14)ని వెనక్కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే క్రెగ్ ఓవర్టాన్ (8)ను కూడా షమీ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది.