ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. భువీ, బుమ్రా తర్వాత చాహల్ కూడా సత్తా చాటాడు. తన తొలి ఓవర్లోనే హ్యారీ బ్రూక్ (8)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బ్రూక్.. లాంగాన్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
బ్రూక్ కూడా అవుటవడంతో మొయీన్ అలీ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత అలీ, డేవిడ్ మలాన్ చేతుల్లో ఉంది.