ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. జేసన్ రాయ్ (0), జో రూట్ (0) ఇద్దరినీ ఒకే ఓవర్లో డకౌట్ చేసిన అతను.. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదకరమైన జానీ బెయిర్స్టో (7)ను కూడా పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన బెయిర్స్టో.. డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే వేగంగా వచ్చిన బంతి బ్యాటును ముద్దాడుతూ గాల్లోకి లేచింది. ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ పంత్ అద్భుతంగా దూకి అందుకున్నాడు. దాంతో బెయిర్స్టో ఇన్నింగ్స్ కూడా ముగిసింది. ఇంగ్లండ్ జట్టు 17 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కెప్టెన్ బట్లర్ (12 నాటౌట్), లియామ్ లివింగ్స్టోన్ క్రీజులో ఉన్నారు.