ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా సత్తా చాటాడు. ప్రమాదకరమైన జానీ బెయిర్స్టో (7)ను కూడా అవుట్ చేశాడు. ఈ మధ్యల్ మహమ్మద్ షమీ కూడా మరో ఎండ్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. బెన్ స్టోక్స్ (0)ను పెవిలియన్ చేర్చాడు.
ఈ క్రమంలోనే విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ (0)ను కూడా బుమ్రా డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు పది ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 30 పరుగులతో నిలిచింది. పదో ఓవర్లో బుమ్రా బౌలింగ్లో మొయీన్ అలీ కూడా అవుటవ్వాల్సింది. అయితే బ్యాటర్ వెనుక నుంచి వచ్చిన బంతిని అందుకోవడంలో కీపర్ పంత్ ప్రయత్నం వృధా అయింది. దీంతో అలీ బతికిపోయాడు. ప్రస్తుతం క్రీజులో మొయీన్ అలీతో పాటు కెప్టెన్ బట్లర్ (14 నాటౌట్) ఉన్నారు.