భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు షమీ బౌలింగ్లో స్టోక్స్ (25) క్యాచ్ వదిలేసిన శార్దూల్.. తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. తన తప్పును సరిదిద్దుకోవడం కోసం అన్నట్లుగా స్టోక్స్ను పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు స్టోక్స్ ఇచ్చిన లో క్యాచ్ను బుమ్రా పట్టుకోలేకపోయాడు.
అలవాటు లేని మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ అందుకోలేకపోయాడు. అయితే తర్వాతి బంతికే స్టోక్స్ మిడాఫ్ మీదుగా బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే ఈసారి బుమ్రా ఎలాంటి పొరపాటు చెయ్యలేదు. వేగంగా డైవ్ చేసిన బుమ్రా క్యాచ్ పట్టేయడంతో స్టోక్స్ మైదానం వీడాడు.
మరో ఆటగాడు బెయిర్స్టో (50 నాటౌట్) హాఫ సెంచరీ పూర్తి చేసుకొని ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. అతనికి శామ్ బిల్లింగ్స్ (4 నాటౌట్) జతకలిశాడు. మరి వీళ్లిద్దరూ కలిసి ఇంగ్లండ్ స్కోరును ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి.