ఈసారి టీ20 ప్రపంచకప్లో వరుణుడు ఎక్కువ మ్యాచులు గెలుస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మ్యాచ్కు మోకాలొడ్డిన వరుణుడి దెబ్బకు మినీ యాషెస్గా అభిమానులు ఎదురు చూసిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా బలైంది. మైదానంలో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో సమయానికి ఈ మ్యాచ్ను ప్రారంభించలేదు.
ఆ తర్వాత పలుమార్లు మైదానం అవుట్ ఫీల్డ్ను పరిశీలించిన అంపైర్లు ఫీల్డ్ ఆటకు సరిపోదని తేల్చారు. బౌలర్ల రనప్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అనంతరం మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. ఈ నిర్ణయం బాధాకరమైనప్పటికీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా తప్పదన్నాడు.
మైదానం చిత్తడిగా ఉన్నప్పుడు ఆటగాళ్లకు తీవ్రమైన గాయాలయ్యే అవకాశాలుంటాయన్న సంగతి తెలిసిందే. బట్లర్ కూడా మ్యాచ్ రద్దవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. గత మ్యాచ్లో పొరపాటు చేసినప్పటికీ ఈ మ్యాచ్లో పూర్తి ఉత్సాహంతో ఆడాలని అనుకున్నామని, ఇక తర్వాతి మ్యాచ్పై ఫోకస్ పెడతామని చెప్పాడు.