దుబాయ్: అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-1లో టేబుల్ టాపర్లుగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం నాడు మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు.
గత మ్యాచ్లో అర్థశతకంతో అలరించిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1) ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే స్టీవ్ స్మిత్ (1), మ్యాక్స్వెల్ (6) అవుటయ్యారు. తొలి పవర్ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి 21/3తో కష్టాల్లో ఉన్న జట్టుకు.. ఏడో ఓవర్ తొలి బంతికి మరో షాక్ తగిలింది.
స్టార్ ఆల్రౌండర్ స్టొయినిస్ (0) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (11 నాటౌట్) ఒక్కడే నిలబడ్డాడు. ఏడు ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 27/4. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ ఇప్పటికే రెండు వికెట్లు తీయగా, రషీద్, జోర్డాన్ చెరో వికెట్ పడగొట్టారు.