మాంగ్కాంగ్: ఎమర్జింగ్ ఆసియాకప్ను భారత అండర్-23 మహిళల జట్టు గెలుచుకున్నది. బుధవారం ఫైనల్లో భారత జట్టు 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి టైటిల్ను దక్కించుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. వృంద 36 టాప్ స్కోరర్ కాగా, కనిక అజేయంగా 30 పరుగులు చేసింది. అనంతరం శ్రేయాంక పాటిల్ 13 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి భారత్ విజయానికి బాటలు వేసింది.