షిల్లాంగ్ : పురుషుల జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత సాగర్, ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ ముందంజవేశారు. రైల్వేస్కు చెందిన సాగర్ 92ప్లస్ విభాగంలో చెమట చిందించకుండానే తొలి రౌండ్లో ఉత్తరాఖండ్కు చెందిన శుభం సింగ్ను చిత్తుచేశాడు. సాగర్ పంచ్లకు ప్రత్యర్థి నిలదొక్కుకోలేకపోవడంతో రెఫరీ మధ్యలోనే మ్యాచ్ను నిలిపివేసి సాగర్ను విజేతగా ప్రకటించాడు. 57 కిలోల విభాగంలో సర్వీసెస్కు చెందిన సచిన్ 5-0తో పంజాబ్కు చెందిన విశాల్ కుమార్పై గెలుపొందాడు. 63.5 కిలోల విభాగంలో వంశజ్, 60 కిలోల విభాగంలో వరిందర్ సింగ్ 5-0తో ప్రత్యర్థులపై గెలుపొంది ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. మొత్తం 13 విభాగాలలో వివిధ రాష్ర్టాలనుంచి 350మందికిపైగా బాక్సర్లు పోటీపడుతున్నారు.