హనుమకొండ చౌరస్తా: వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్వర్యంలో జరుగుతున్న ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ పోటాపోటీగా సాగుతున్నది. మూడో రోజైన శుక్రవారం వేర్వేరు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ పోటీలు జరిగాయి. వరంగల్ క్లబ్ వేదికగా కొనసాగుతున్న టోర్నీ అండర్-15 బాలికల విభాగం క్వార్టర్స్లో మంచాల కీర్తి..రియాపై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది.
మిగతా మ్యాచ్ల్లో వర్షిణిరెడ్డిపై అక్షయ, అవనీపై కైవల్య, వైశాల్యపై అమృతరావు విజయాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు అండర్-15 బాలుర క్వార్టర్స్లో యువసూర్య..అలీ సిద్ధిఖీపై గెలిచి సెమీస్లోకి ప్రవేశించగా, నిషాంత్, శశాంక్, అఖిలేశ్, నిహాల్, వివేక్ గెలిచి ముందంజ వేశారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి టోర్నీలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.