పోర్ట్ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. క్వీన్స్పార్క్ ఓవల్లో ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. జింబాబ్వే బ్యాటింగ్ సమయంలో 15-20 సెకన్ల పాటు భూమి కంపించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. వెస్టిండీస్ కాలమానం ప్రకారం ఉదయం 9.40 నిమిషాలకు రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్లు యూడబ్ల్యూ పరిశోధన కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్ల ప్లేయర్లు భూకంపాన్ని గుర్తించలేదు. కామెంటరీ బాక్స్లో ఉన్న వ్యాఖ్యాతలు ఈ విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ వర్గీకరణ మ్యాచ్లో జింబాబ్వేపై ఐర్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 32 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. డిక్సన్ (78 నాటౌట్), కెప్టెన్ టిమ్ టెక్టార్(76 నాటౌట్) అర్ధసెంచరీలతో ఐర్లాండ్ను గెలిపించారు.