హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ కుమార్తె సంచలన నిర్ణయం తీసుకుంది. డ్వేన్ జాన్సన్ సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించడానికి ముందు డబ్ల్యూడబ్ల్యూఈ అనే రెజ్లింగ్ షోలో ఫైట్లు చేసేవాడన్న సంగతి తెలిసిందే. ‘ది రాక్’ అనే స్టేజ్ నేమ్తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జాన్సన్ పెద్ద కుమార్తె సిమోనే జాన్సన్ ఎంచుకున్న కెరీర్ ఇప్పుడు వైరల్గా మారింది.
తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన ఆమె కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఎక్స్టీ అనే రెజ్లింగ్ టీవీ ప్రోగ్రాంలో పాల్గొనబోతోంది. తర్వాతి తరం రెజ్లింగ్ స్టార్లతో ఈ షో నిర్వహిస్తారు. జాన్సన్ కుటుంబం నుంచి రెజ్లింగ్ రింగ్లో దిగుతున్న నాలుగో తరం స్టార్ ఆమె. డ్వేన్ జాన్సన్ మొదటి భార్య డ్యానీ గార్సియా కుమార్తె ఈ సిమోనే. ‘అవా రైన్’ అనే స్టేజ్ నేమ్తో రెజ్లింగ్ బరిలో దిగబోతోంది.
‘ది షిమ్స్’ అనే గ్రూప్ సభ్యురాలిగా ఆమె కనిపిస్తోంది. ఇటీవల ఈ రెజ్లింగ్ షోలో షిమ్స్ టీం పాల్గొనే సమయంలో ఎవరో ఆ గ్రూపునకు సంబంధించిన మాస్కు పెట్టుకొని ప్రేక్షకుల మధ్యలో కనిపిస్తూ వచ్చారు. ఆమె మాస్కు తొలగించడంతో సైమోనే ముఖం కనిపించింది. తను షిమ్స్ కుటుంబంలో సభ్యురాలినని, ఈ కుటుంబం తనకు చాలా సంతృప్తిని అందిస్తోందని అవా రైన్ చెప్తోంది.
Complete.
We are the 𝐒𝐂𝐇𝐈𝐒𝐌.
🙂🙂🙂🙂 pic.twitter.com/PrhWpeT9Mt
— James? (@Jagger_WWE) October 26, 2022