ఛత్తీస్గఢ్: భారత స్టార్ స్ప్రింటర్, ఆసియా గేమ్స్ రజత పతక విజేత ద్యుతీచంద్కు ‘వీర్ణీ’ పురస్కారం దక్కింది. క్రీడా రంగంలో విశేషంగా రాణిస్తున్న ఆమెను అవార్డుకు ఎంపిక చేసినట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా ఏప్రిల్ 14న వర్చువల్గా జరిగే కార్యక్రమంలో ద్యుతీ ఈ పురస్కారాన్ని అందుకోనుంది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సత్కరించేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వీర్ణీ పురస్కారాలను ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టింది. 2019 ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో స్వర్ణం దక్కించుకున్న ద్యుతీ.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు శ్రమిస్తున్నది.