హామిల్టన్: భారీ వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రైద్దెంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ గెలుపొందగా.. ఆదివారం వర్షం కారణంగా రెండో వన్డే అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడి పంజాతో నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కాగా.. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది. మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించగా.. టీమ్ఇండియా 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.
కెప్టెన్ శిఖర్ ధవన్ (3) విఫలం కాగా.. శుభ్మన్ గిల్ (42 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ దశలో మరోసారి మ్యాచ్కు వరుణుడు అంతరాయ కలిగించగా.. ఆ తర్వాత ఎడతెరిపి లేని వర్షం కురువడంతో అంపైర్లు పలుమార్లు పరిశీలించిన అనంతరం రెండో వన్డేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం న్యూజిలాండ్ 1-0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య బుధవారం మూడో వన్దే జరుగనుంది.