న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కెప్టెన్(Australia Captain) ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins).. స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఓటమి తర్వాత కమ్మిన్స్ .. కుటుంబ కారణాల(Family Reasons) వల్ల స్వదేశానికి వెళ్లినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొన్నది. కమ్మిన్స్ ఫ్యామిలీ సభ్యుల్లో తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు సీఏ తెలిపింది. అయితే మార్చి ఒకటో తేదీన ఇండోర్లో ప్రారంభంకానున్న మూడవ టెస్టు కంటే ముందే కమ్మిన్స్ మళ్లీ ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. పర్సనల్ కారణాల వల్ల కమ్మిన్స్ ఇంటికి వెళ్లినట్లు సీఏ సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అతని ప్రైవసీని మీడియా గౌరవించాలని సీఏ తన ప్రకటనలో కోరింది.
The Australian captain is not expected to miss a Test #INDvAUS https://t.co/WD7cyux2xx
— cricket.com.au (@cricketcomau) February 20, 2023
రెండు టెస్టుల్లో ఇండియా ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. నాగపూర్లో జరిగిన తొలి టెస్టులో.. ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో ఆసీస్పై భారత్ విజయం సాధించింది. ఇక రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది. మార్చి 17వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభంకానున్నది.