దుబాయ్: పొట్టి ప్రపంచకప్నకు ముందు స్వదేశంలో కంగారూలపై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత్ 268 పాయింట్లతో టాప్లో నిలువగా.. ఇంగ్లండ్ 261 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నది.
ఇరు జట్ల మధ్య ఏడు పాయింట్ల వ్యత్యాసం ఉండగా.. బుధవారం నుంచి రోహిత్ సేన దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ 258 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు ర్యాంక్ల్లో ఉన్నాయి.