దుబాయ్: ఈ సీజన్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. దుబాయ్ చాంపియన్షిప్ డబుల్స్ సెమీస్లో పరాజయం పాలైంది. శుక్రవారం రాత్రి జరిగిన డబ్ల్యూటీఏ-500 మహిళల డబుల్స్ పోరులో సానియా-లూసీ హ్రెడెకా (చెక్ రిపబ్లిక్) జోడీ 6-2, 2-6, 7-10తో లియుడ్మైలా కిచెనోక్ (ఉక్రెయిన్)-జెలెనా ఒస్టపెంకొ (లాత్వియా) ద్వయం చేతిలో ఓడింది. తొలి సెట్లో విజయం సాధించిన సానియా జంట.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు చేజార్చుకుంది. ఏడు ఏస్లు సంధించినా.. నెట్ గేమ్ తప్పిదాల వల్ల సానియా జోడీకి పరాజయం తప్పలేదు.
అర్జున్ జోడీకి టైటిల్
బెంగళూరు: భారత యువ టెన్నిస్ ప్లేయర్ అర్జున్ బెంగళూరు ఓపెన్-2 ఏటీపీ చాలెంజర్ ట్రోఫీ టైటిల్ చేజిక్కించుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అర్జున్-అలెగ్జాండర్ (ఆస్ట్రేలియా) జంట 6-3, 6-7 (4/7), 10-7తో భారత్కే చెందిన సాకేత్ మైనేనీ- రామ్కుమార్ రామ్నాథన్ జోడీపై విజయం సాధించింది.