న్యూఢిల్లీ: ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతో ప్రశాంతంగా ఉండే భారత దిగ్గజం, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఓ దశలో మహేంద్ర సింగ్ ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ద్రవిడ్ నటించిన ఓ యాడ్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో… నిజజీవితంలో ఎప్పుడైనా అతడు ఆగ్రహించాడా అని ఎదురైన ప్రశ్నకు సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. 2006లో పాకిస్థాన్తో వన్డే జరుగుతున్న సమయంలో ధోనీపై ద్రవిడ్ అరిచాడని గుర్తు చేసుకున్నాడు.‘ధోనీ ఓ మ్యాచ్లో షాట్ కొట్టి క్యాచ్ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగేనా నువ్వు ఆడేది..? మ్యాచ్ను నువ్వే ముగించాల్సింది అన్నాడు’ అని అప్పటి విషయాలను సెహ్వాగ్ చెప్పాడు.