భారత మాజీ క్రీడాకారిణి, దిగ్గజ లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆమె.. దేశంలోని క్రీడాకారులు ఉపయోగించే డ్రగ్స్ అన్నీ విదేశాల నుంచి వచ్చినవే అని చెప్పారు. రెండ్రోజుల పాటు జరిగే వార్షిక జనరల్ మీటింగ్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘డోపింగ్లో దొరికిపోయిన భారత అథ్లెట్లు ఉపయోగించే డ్రగ్స్ ఏవీ భారత్లో దొరకవు. అవన్నీ విదేశాల నుంచి వచ్చినవే’’ అని ఆమె ఆరోపించారు. కొందరు కోచ్లు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, అలాగే విదేశాల నుంచి తిరిగొచ్చిన క్రీడాకారులు కూడా తమతోపాటు ఈ పెర్ఫామెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ తెచ్చుకుంటున్నారని అంజూ పేర్కొన్నారు.
దీనిపై ఏఎఫ్ఐ ప్రెసిడెంట్ అడిల్లె సుమరివాల కూడా స్పందించారు. ఇకపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) క్రీడాకారులకు నిర్వహించే డోపింగ్ టెస్టులను మరింత కఠినతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. క్రీడారాకులెవరూ ఇలాంటి డ్రగ్స్ వాడొద్దని, వాడిన తర్వాత బుకాయించొద్దని, అలా చేస్తే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.