R Sridhar : కెప్టెన్గా ఎం.ఎస్.ధోనీ భారత జట్టుపై చెరగని ముద్ర వేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. అతని అతని సారథ్యంలో టీమిండియా రెండు ఐసీసీ ట్రోఫీలు నెగ్గింది. భారత విజయవంతమైన కెప్టెన్గా పేరు తెచ్చుకున్యన ధోనీ 2020లో క్రికెట్కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే.. 2019 వరల్డ్ కప్తో అతను ఆటకు గుడ్ బై చెప్పాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తన పుస్తకంలో వెల్లడించాడు. ‘కోచింగ్ బియాండ్ – మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’ (Coaching Beyond- My days with the Indian cricket team) అనే . బుక్లో ఎం.ఎస్.ధోని, రిషభ్ పంత్ మధ్య జరిగిన సంభాషణను అతను ప్రస్తావించాడు.
ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైమ్లో..
2019 వరల్డ్ కప్లో ఇండియా – న్యూజిలాండ్ సెమీస్ పోరుకు రిజర్వ్ డే ముందు.. ధోనీ ‘జట్టుతో నా చివరి బస్సు జర్నీని మిస్ కావొద్దు అనుకుంటున్నా’ అని పంత్తో అన్నాడు. టీమిండియా తరఫున ధోనీ ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే.. అతను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే..! రిజర్వ్ డే ఉదయం బ్రేక్ఫాస్ట్ హాల్లో ఉన్నాను. కాఫీ తాగుతుండగా ధోనీ, పంత్ అక్కడికి వచ్చారు. ‘న్యూజిలాండ్ ఆట మరికొన్ని ఓవర్లలో ముగుస్తుంది. ఆ తర్వాత మనం బ్యాటింగ్కు దిగుతాం. మ్యాచ్ తొందరగానే ముగుస్తుంది’ అని పంత్, ధోనీతో అన్నాడు. అంతేకాదు.. ‘భయ్యా.. ఈరోజే కొందరు లండన్కు వెళ్లాలి అనుకుంటున్నారు. నువ్వు కూడా వెళ్తావా?’ అని హిందీలో ధోనీని అడిగాడు. అందుకు అతను.. ‘లేదు పంత్.. జట్టుతో చివరి బస్సు జర్నీని నేను మిస్ కావొద్దు అనుకుంటున్నా’ అని బదులిచ్చాడు అంటూ శ్రీధర్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.
2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్ 18 పరుగులతో ఇండియాపై గెలిచింది. ఈ మ్యాచ్లో50 రన్స్ చేసిన ధోనిని మార్టిన్ గుఫ్తిల్ రనౌట్ చేశాడు. 2020 ఆగష్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. శ్రీధర్ 2014-21 వరకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా విధులు నిర్వహించాడు.