ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో బుధవారం ముగిసిన మ్యాచ్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్లు భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్కు 42 బంతుల్లోనే 98 పరుగులు జోడించారు. మ్యాచ్ ముగిశాక కోహ్లీ.. సూర్యను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.
ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సూర్య.. హరూన్ అర్షద్ వేసిన చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆ సమయంలో కోహ్లీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉండి సూర్య ఆటను ఆస్వాదించాడు. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. ‘చివరి ఓవర్లో నువ్వు నాలుగు సిక్సర్లు కొట్టావ్. ఆరు సిక్సర్లు కొట్టి రెండో భారతీయ బ్యాటర్ (2007 టీ20 ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదాడు) అవుదామనుకున్నావా..?’ అని ప్రశ్నించాడు.
దానికి సూర్య సమాధానం చెబుతూ.. ‘నేను ప్రయత్నించాను. కానీ యువీని దాటలేకపోయా..’అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు కోహ్లీ.. ‘అవును.. బ్రాడ్ బౌలింగ్ లో యువీ పా చేసిన ప్రదర్శన అద్భుతం..’ అని చెప్పాడు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో కోహ్లీ.. సూర్య బ్యాటింగ్ను అంత దగ్గర్నుంచి చూడటం తనకు ఇదే ప్రథమమని, తాను మాత్రం అతడి ఆటకు ఫిదా అయిపోయానని చెప్పాడు. ఈ మ్యాచ్లో సూర్య (68), విరాట్ కోహ్లీ (59) లు చివరివరకు నాటౌట్గా నిలిచి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత బౌలర్లు హాంకాంగ్ను 152 పరుగులకే పరిమితం చేశారు.
Of two stellar knocks, a dominating partnership, mutual admirations & much more 💥👌
𝐃𝐨 𝐍𝐨𝐭 𝐌𝐢𝐬𝐬 – Half-centurions @imVkohli & @surya_14kumar chat up after #TeamIndia‘s win against Hong Kong 👍 – by @ameyatilak
Full interview📽️👇 #AsiaCup2022 https://t.co/Hyle2h3UBQ pic.twitter.com/39Ol62g2Qf
— BCCI (@BCCI) September 1, 2022