గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలో చివరిసారి ఈ టోర్నీలో ఆడిన టీమిండియా.. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు చవిచూసి గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. ఈ క్రమంలో వచ్చే టీ20 ప్రపంచకప్ విషయంలో భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కొత్త సలహా ఇచ్చాడు.
ప్రస్తుత ఐపీఎల్లో అదరగొడుతున్న కర్ణాటక బ్యాటర్ దినేష్ కార్తీక్కు భారత జట్టులో చోటు కల్పించాలని గవాస్కర్ అన్నాడు. టీమిండియాలో ఫినిషర్గా డీకేను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘తన ప్రదర్శనతో ఆట తీరునే మార్చేస్తున్నాడు. ప్రపంచకప్లో 6 లేదా 7వ స్థానంలో దిగే ఆటగాడి నుంచి ఏమి ఆశిస్తామో అది చేసి చూపిస్తున్నాడు’’ అని గవాస్కర్ కితాబిచ్చాడు. మరి టీమిండియా సెలెక్టర్లు డీకేకు అవకాశం ఇస్తారా? లేక వయసు కారణంగా చూపి పక్కన పెట్టేస్తారా? అనేది చూడాలి.