కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
బయటికెళ్లితే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ
రానున్న హోలీ పండుగ సందర్భంగా జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ నారాయణ సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంపులుగా హోలీ ఆడితే మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు, చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవడం తదితర నిబంధనలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.