చెన్నై: ఐపీఎల్లో ధోనీ(Dhoni) కొత్త మైలురాయిని చేరుకోనున్నాడు. ఇవాళ రాజస్థాన్తో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ కెరీర్లో ధోనీ.. చెన్నై జట్టుకు 200వ సారి సారథ్య బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నిలకడగా కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్న వారిలో ధోనీ ఒకడు. అతని నేతృత్వంలోనే చెన్నై జట్టు(Chennai Super Kings) నాలుగు సార్లు టైటిల్ సాధించింది. 2010, 2011, 2018, 2021 సంవత్సరాల్లో ఆ జట్టు ట్రోఫీని గెలుచుకున్నది.
ధోనీ ఇప్పటి వరకు ఐపీఎల్లో 213 మ్యాచ్లకు కెప్టెన్సీ చేపట్టాడు. దాంట్లో 125 మ్యాచుల్లో నెగ్గగా, 87 మ్యాచుల్లో ఓటమి ఎదురైంది. ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. అతని విన్నింగ్ పర్సంటేజ్ 58.96 శాతంగా ఉంది. రైజింగ్ పూణె సూపర్గెయింట్ జట్టుకు కూడా ధోనీ కెప్టెన్గా చేశాడు. రెండేళ్లలో ఆ జట్టు 14 మ్యాచ్లు ఆడింది.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ 199 మ్యాచ్లకు కెప్టెన్గా చేశాడు. అతని సారథ్యంలో ఆ జట్టు 120 సార్లు గెలిచింది. 78 సార్లు ఓడింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ధోనీ అయిదు వేల పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 39.09గా ఉంది. స్ట్రయిక్ రేటు 135. ఐపీఎల్లో మొత్తం అతను 24 హాఫ్ సెంచరీలు చేశాడు.