Ajay Jadeja : హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని యువ భారత్ శ్రీలంకతో టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో విజయవంతమైన సారథిగా మరోసారి పాండ్యా నిరూపించుకున్నాడు. దాంతో.. 2024 వరల్డ్ కప్లోగా రోహిత్ శర్మ కెప్టెన్గా తప్పుకోవాలని, పాండ్యాకు బాధ్యతలు అప్పగించాలని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. ‘గతంలో మహేంద్ర సింగ్ ధోనీ టీ20 పగ్గాలను విరాట్ కోహ్లీకి అప్పగించాడు. అది బీసీసీఐ, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం కాదు. ధోనీనే కోహ్లీని తన వారసుడిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అదే పని చేయాలి. హార్ధిక్ పాండ్యాకు అతను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి’ అని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత పాండ్యా ఆటతీరు ఎంతో మారింది. అతని కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ (2022) ఛాంపియన్గా అవతరించింది. టీ20 వలర్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో పాండ్యా నాయకత్వంలోని టీమిండియా గెలిచింది. దాంతో, భారత పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్గా పాండ్యాను కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రోహిత్ శర్మకు అతను సరైన వారసుడు అని మాజీలు కొందరు అంటున్నారు.