Ravi Shastri : టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్కు రావాల్సినంత గుర్తింపు రాలేదని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. న్యూజిలాండ్తో మొదటి వన్డే జరుగుతుండగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ధావన్కు రావాల్సినంత పేరు రాలేదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీదనే అందరి దృష్టి ఉండడమే అందుకు కారణం. ధావన్కు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లు చాలామంది ఉన్నప్పటికీ ధావన్కు వన్డేల్లో ఉన్న అనుభవం విలువైనది. అతను యంగ్స్టర్స్ను గైడ్ చేయగలడు’ అంటూ చెప్పుకొచ్చాడు. మొదటి వన్డేలో శిఖర్ ధావన్ 77 బంతుల్లో 72 రన్స్ చేశాడు.
ధావన్ కెప్టెన్సీలో టీమిండియా న్యూజిలాండ్లో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. తొలివన్డేలో ధావన్తో పాటు ఓపెనర్ శుభ్మన్ గిల్ (50), శ్రేయర్ అయ్యర్ (80) హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో 50 ఓవర్లలో 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ (148) సెంచరీతో చెలరేగాడు. అతనికి కెప్టెన్ విలియమ్సన్ (94రన్స్) అండగా నిలవడంతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.