న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనడానికి న్యాయస్థానం అనుమతినిచ్చింది. మాతృత్వ విరామం తర్వాత తిరిగి వస్తున్న ఆమెలాంటి దిగ్గజ రెజ్లర్ను పరిగణనలోకి తీసుకోకుండా దూరం పెట్టడం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఎంపిక విధానంలోని లోపాన్ని ఎత్తిచూపుతోందని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన మునుపటి ఆర్డర్ను కొట్టేస్తూ ఫొగాట్ అప్పీల్పై కోర్టు శనివారం తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 30, 31 తేదీల్లో జరిగే సెలెక్షన్ ట్రయల్స్ మొత్తాన్ని డబ్ల్యూఎఫ్ఐ తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలి. అంతేకాకుండా, సాయ్, ఐఏఓ నుంచి స్వతంత్ర పర్యవేక్షకులు ట్రయల్స్ను పర్యవేక్షించాలని కోర్టు స్పష్టం చేసింది.