IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కీలక పోరులో జూలు విదిల్చింది. బలమైన లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తుగా ఓడించి రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గెలుపు జోష్లో ఉన్న ఢిల్లీకి భారీ షాక్ తగిలేలా ఉంది. కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant)పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. అవును.. ఇప్పటికే రెండు మ్యాచుల్లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా కట్టిన పంత్.. లక్నోపై కూడా అదే తప్పు చేశాడు.
16వ ఓవర్కే ఓవర్ రేటు సమయం దాటింది. దాంతో, ఆఖరి ఓవర్లో ఐదుగురు ఫీల్డర్లు 30 అడుగుల వలయం బయట ఉన్నారు. లక్నో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు గురించి రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే జరిమానాతో పాటు ఒక్క మ్యాచ్ నిషేధం కూడా పడే చాన్స్ లేకపోలేదు.
ఐపీఎల్ నియమాల ప్రకారం మొదటిసారి నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోతే కెప్టెన్కు రూ. 12 లక్షల ఫైన్ వేస్తారు. రెండో సారి కూడా స్లో ఓవర్ రేటును గుర్తిస్తే అతడికి రూ.24 లక్షలు జరిమానా పడుతుంది. జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత తప్పదు. ఒకవేళ మూడోసారి కూడా టైమ్ కల్లా ఓవర్లను పూర్తి చేయకుంటే.. ఆ జట్టు కెప్టెన్కు ఏకంగా రూ. 30 లక్షల ఫైన్తో పాటు ఒక్క మ్యాచ్ నిషేధం విధిస్తారు.
First win against LSG in IPL 🤝🏻 2nd win of the season 👏
Mehfil-e-Ekana thi romanch se bhari 💙❤#YehHaiNayiDilli #LSGvDC pic.twitter.com/EiyaSeABWH
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2024
లక్నో నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో యువకెటరం ఫ్రేజర్(55) అండగా పంత్ రెచ్చిపోయాడు. 41 రన్స్ కొట్టి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, ఢిల్లీ 6 వికెట్లతో గెలుపొంది హ్యాట్రిక్ ఓటమి తప్పించుకుంది. తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 17న గుజరాత్ టైటాన్స్తో ఢిల్లీ తలపడనుంది.