లక్నో: ఉత్తరప్రదేశ్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొంది. (AAP Support in UP) ఆప్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులకు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే తమ పాత్ర ఏమిటి, ప్రచారంలో ఎవరు పాల్గొంటారు అన్నది కాంగ్రెస్తో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఎస్పీ అభ్యర్థులకు పూర్తిగా మద్దతు ఇస్తామని అన్నారు. దీని కోసం ఎలాంటి షరుతులు లేదా డిమాండ్లు లేవని స్పష్టం చేశారు.
కాగా, ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన ఆప్కు అఖిలేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికలు సాధారణ పరిస్థితుల్లో జరుగడం లేదని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమేనని అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ను జైలుకు పంపారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలా చేస్తోందని విమర్శించారు.