WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ – 2024లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 182 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ) విఫలమైంది.
బెంగళూరు బ్యాటర్లలో రిషాఘోష్ 51, ఎలిసే పెర్రీ 49, సోఫీ మోలినైక్స్ 33 పరుగులతో మెరిపించారు. మిగతా వారెవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరియాజన్నే కాప్, అలిస్ క్యాప్ సే, శిఖా పాండే, అరుంధతీ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు సారధి స్మ్రుతి మందానా క్యాప్ సే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ కాగా, ఎలిసే పెర్రీ, రిషా గోష్, దిశా కసాత్ రనౌట్ అయ్యారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. బ్యాటర్లు జెమిమా రోడ్రిగ్స్ 58, అలిస్ కాప్ సే 48 పరుగులు చేయగా, సారధి కం ఓపెనర్ మెగ్ లానింగ్ 29, మరో ఓపెనర్ షాఫాలీ వర్మ 23 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంకా పాటిల్ నాలుగు, ఆషా శోభన ఒక వికెట్ తీశారు.