ఢిల్లీ చేతిలో పరాజయం
దాబాద్: టేబుల్ టాపర్గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారిన తరుణంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ మంగళవారం జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో పాండ్యా సేనను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అమన్ హకీమ్ ఖాన్ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా..
అక్షర్ పటేల్ (27), రిపాల్ పటేల్ (23) పర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో షమీ 4, మోహిత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు) చివరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. గిల్ (6), సాహా (0), విజయ్ శంకర్ (6), డేవిడ్ మిల్లర్ (0) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, ఇషాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షమీకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా బుధవారం లక్నోతో చెన్నై, పంజాబ్తో ముంబై తలపడనున్నాయి.