న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బుధవారం సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో డీసీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్(Munaf Patel)కు.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అతనికి ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని మునాఫ్ ఉల్లంఘించాడు. ఐపీఎల్లోని ఆర్టికల్ 2.20 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు మునాఫ్ అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపారు.
Munaf Patel had a heated exchange with the 4th umpire during the #DCvRR match at the Arun Jaitley Stadium, Delhi after the umpire denied sending a player to enter the ground to convey his message.#DCvsRR #IPL2025 pic.twitter.com/hHv0tNAUvd
— Gaurav Chaudhary (@gkctweets) April 16, 2025
దేని వల్ల మునాఫ్కు జరిమానా విధించారన్న విషయాన్ని ఆ స్టేట్మెంట్లో చెప్పలేదు. కానీ మ్యాచ్ అఫీషియల్తో మాజీ ఇండియన్ బౌలర్ వాగ్వాదం చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని మైదానంలో ఉన్న తమ ప్లేయర్లకు చెప్పేందుకు ఓ ప్లేయర్ను పంపాలని డీసీ యోచించింది. అయితే మ్యాచ్ అధికారి అడ్డుకోవడంతో.. ఆ సమయంలో మునాఫ్ పటేల్ ఆ అఫీషియల్తో వాగ్వాదానికి దిగాడు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని 2011లో వన్డే వరల్డ్కప్ గెలిచిన బృందంలో మునాఫ్ ఉన్నాడు.
గత ఏడాది నవంబర్లో డీసీ బౌలింగ్ కోచ్గా మునాఫ్ను నిమించారు. జేమ్స్ హోప్స్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. క్రీడా స్పూర్తికి వ్యతిరేకంగా ఏం జరిగినా, దానికి ఆర్టికల్ 2.20 ప్రకారం జరిమానా విధించనున్నారు.