న్యూఢిల్లీ: రానున్న సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడ్డ పంత్ గత 14 నెలల వ్యవధిలో ఎవరూ ఊహించని రీతిలో కోలుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పూర్తి ఫిట్నెస్ సాధించిన పంత్..త్వరలో మొదలయ్యే ఐపీఎల్-17వ సీజన్లో ఢిల్లీని ముందుండి నడిపించనున్నాడు.
‘రిషబ్ పంత్ కెప్టెన్గా తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నాం. అతని పట్టుదల, భయంలేని తనం ఎప్పుడు బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను శాసిస్తుంది. పంత్ ఇంత త్వరగా కోలుకోవడం పెద్దగా ఆశ్చర్యపర్చలేదు. పంత్ కెప్టెన్గా జట్టు నూతనోత్తేజంతో కొత్త సీజన్ను ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాం’అని ఢిల్లీ సహ యజమాని పార్త్ జిందాల్ అన్నాడు. ఈ నెల 23న తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ..పంజాబ్తో తలపడుతుంది.