WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గురువారం జరిగిన మ్యాచ్లో ముంబై 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యఛేదనలో యూపీ 118-9 స్కోరుకు పరిమితమైంది. దీప్తిశర్మ(53 నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లు చేశారు. సైకా ఇషాక్ (3-27), బ్రంట్ (2-14) యూపీ పతనంలో కీలకమయ్యారు.