శామీర్పేట: ఈజిప్టు వేదికగా జరిగే వాలీబాల్ వరల్డ్కప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన పారా ప్లేయర్ దీరావత్ మహేశ్నాయక్ ఎంపికయ్యాడు. సీఎం కేసీఆర్ దత్తత మండలం మూడుచింతలపల్లిలోని లింగాపూర్ తండాకు చెందిన మహేశ్నాయక్ పారా ఒలింపిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
అయితే ఈజిప్టు టోర్నీలో పాల్గొనేందుకు దారి ఖర్చుల కోసం మహేశ్కు రూ.2.50 లక్షలు అవసరమవుతున్నాయి. ఈ మొత్తంలో 50 శాతం నగదు ఈ నెల 30లోపు డిపాజిట్ చేస్తే విమాన టిక్కెట్లు, జట్టులో చోటు దక్కుతుందని తెలిపాడు. పారా ఒలింపిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ అకౌంట్ నంబర్ 35978402686 ద్వారా దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.