భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడుతోంది. అంతకుముందు రాజస్థాన్ బ్యాటర్లంతా రాణించడంతో ఆ జట్టు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కీలకమైన డేవిడ్ వార్నర్ (24)ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయగా.. పవర్ప్లే చివరి ఓవర్లో బంతి అందుకున్న రవిచంద్రన్ అశ్విన్ కూడా ఢిల్లీని దెబ్బతీశాడు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (1)ను అవుట్ చేశాడు.
అశ్విన్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు సర్ఫరాజ్ ప్రయత్నించాడు. అయితే అశ్విన్ బాగా ఆఫ్సైడ్ వేసిన ఆ బంతి గాల్లోకి లేచింది. దాన్ని సర్కిల్లో ప్రసిద్ధ్ కృష్ణ సులభంగా అందుకోవడంతో సర్ఫరాజ్ వెనుతిరిగాడు. దీంతో కెప్టెన్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఢిల్లీ గెలవాలంటే పృథ్వీ షా, పంత్ గట్టి భాగస్వామ్యం నెలకొల్పాల్సిందే.