భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఓపెనర్లు శుభారంభం అందించాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో మంచి ఆరంభమే అందించినప్పటికీ కీలకమైన డేవిడ్ వార్న్ (28) అవుటవడంతో ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది.
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన వార్నర్.. మూడో బంతికి అవుటయ్యాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను వెనక్కు వెళ్లి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ శాంసన్ సులభంగా అందుకోవడంతో వార్నర్ కథ ముగిసింది.