రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా తడబడింది. పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఏ కోశానా కోలుకునేలా కనిపించడం లేదు. డేవిడ్ వార్నర్ (28), పృథ్వీ షా (37) శుభారంభం అందించినప్పటీకీ.. వికెట్ల కోల్పోవడం ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. సర్ఫరాజ్ ఖాన్ (1) విఫలమవగా..
ఆదుకుంటాడని అనుకున్న రిషభ్ పంత్ (44) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (1)ను చాహల్ అవుట్ చేశాడు. కాసేపటికే శార్దూల్ ఠాకూర్ (10) రనౌట్ అయ్యాడు. క్రీజులో ఉన్న లలిత్ యాదవ్ (25 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో 158 పరుగుల వద్ద ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. చాహల్ ఒక వికెట్ కూల్చాడు.