ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు తడబడింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లు ఎదురుదాడికి దిగడంతో పంజాబ్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతిరగ్గా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24) తనకు దక్కిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఆ తర్వాత భారీ అంచనాలు పెట్టుకున్న లియామ్ లివింగ్స్టన్ (2)ను అక్షర్ పటేల్ బోల్తాకొట్టించాడు. అక్షర్ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు అతను ప్రయత్నించగా.. పంత్ వికెట్లను కూల్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జానీ బెయిర్స్టో (9) కూడా అవుటయ్యాడు.
ఇలాంటి సమయంలో యువ ఆటగాడు జితేష్ శర్మ జట్టును ఆదుకున్నాడు. షారుఖ్ ఖాన్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడటంతో పంజాబ్ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 77/4 స్కోరుతో నిలిచింది.