టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ కకావికలమైంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (9), మయాంక్ అగర్వాల్ (22), జానీ బెయిర్స్టో (9) విఫలమయ్యారు. వారి తర్వాత భారీ అంచనాలతో బరిలోకి వచ్చిన లియామ్ లివింగ్స్టన్ (2) కూడా అవుటవడంతో పంజాబ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
ఇలాంటి సమయంలో జట్టును ఆదుకున్న జితేష్ శర్మ (32)ను కూడా అక్షర్ పటేల్ వెనక్కు పంపాడు. పదమూడో ఓవర్లో బంతి అందుకున్న అతను.. తొలి బంతికే జితేష్ను ఎల్బీడబ్ల్యూ అవుట్ చేశాడు. జితేష్ రివ్యూ కోరినా ఫలితం మారలేదు. దీంతో 85 పరుగుల వద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజులో షారుఖ్ ఖాన్, రబాడ ఉన్నారు.