ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ (36 నాటౌట్) దంచికొట్టాడు. అతనికి కెప్టెన్ రాహుల్ (10 నాటౌట్) నుంచి మంచి సహకారం అందింది. దాంతో లక్నో జట్టు పవర్ప్లే ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది.
ఓపెనర్ పృథ్వీ షా (61) సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ మిగతా బ్యాటర్లు సమిష్టిగా విఫలం అవడంతో 20 ఓవర్లకు కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.